unfoldingWord 31 - యేసు నీళ్ళమీద నడవడం
Đề cương: Matthew 14:22-33; Mark 6:45-52; John 6:16-21
Số kịch bản: 1231
ngôn ngữ: Telugu
Khán giả: General
Mục đích: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Trạng thái: Approved
Bản văn này là một hướng dẫn cơ bản cho dịch và thu âm trong các ngôn ngữ khác. Nó phải được thích nghi với nền văn hóa và ngôn ngữ để làm cho nó phù hợp với từng khu vực, nơi nó được sử dụng khác nhau. Một số thuật ngữ và khái niệm được sử dụng có thể cần một lời giải thích đầy đủ hơn hoặc thậm chí bị bỏ qua trong các nền văn hóa khác nhau.
Kịch bản
ఐదువేల మందికి ఆహారాన్ని పంచిన తరువాత ప్రభువైన యేసు తన శిష్యులకు పడవలోనికి వెళ్లాలని చెప్పాడు. సముద్రం ఆవలి వైపుకు వెళ్లాలని ఆయన వారిని కోరాడు. ఆయన సముద్రం ఒడ్డున కొంతసేపు నిలిచాడు. కనుక శిష్యులు పడవలో బయలుదేరారు. యేసు జనసమూహములను తమ గృహాలకు పంపివేసాడు. తరువాత ఆయన ప్రార్థన చెయ్యడానికి కొండమీదకు వెళ్ళాడు, రాత్రంతా పార్థన చెయ్యడంలో ఆయన ఒంటరిగా సమయాన్ని గడిపాడు.
ఈ సమయంలో శిష్యులు పడవ నడుపుతూ ఉన్నారు, అయితే వారి పడవకు వ్యతిరేకంగా పెద్ద గాలి వీస్తుంది, అర్థరాత్రి సమయంలో వారు సముద్రం మధ్యలో ఉన్నారు.
ఆ సమయంలో ప్రభువు తన ప్రార్థనను ముగించి తన శిష్యులను కలుసుకోడానికి వెళ్ళాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తూ పడవ వద్దకు వస్తున్నాడు.
శిష్యులు ఆయనను చూచారు, వారు చాలా భయపడ్డారు ఎందుకంటే ఆయన ఒక భూతం అని భావించారు. వారు భయపడ్డారని యేసుకు తెలుసు. కనుక ఆయన వారిని పిలిచాడు, “భయపడకండి. నేనే!” అని చెప్పాడు.
అప్పుడు పేతురు ప్రభువుతో ఇలా చెప్పాడు, “ప్రభూ, ఇది నీవే అయితే నీటి మీద నడుస్తూ నీ వద్దకు రావడానికి నాకు అనుమతి ఇవ్వు.” అందుకు ప్రభువు పేతురుతో “రమ్ము” అని చెప్పాడు.
కనుక పేతురు పడవలోనుండి బయటకు వచ్చారు, నీటిమీద నడుస్తూ యేసు వైపుకు నడవడం ఆరంభించాడు. అయితే కొంత దూరం నడచిన తరువాత, పేతురు తన చూపును యేసు నుండి మరల్చి అలలను చూడడం ఆరంభించాడు. బలమైన గాలులను చూచాడు.
అప్పుడు పేతురు భయపడ్డాడు, నీటిలోనికి మునిగి పోవడం ఆరంభించాడు. “ప్రభూ నన్ను రక్షించు” అని బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. యేసు తన చేతిని చాపి పేతురు చేతిని పట్టుకొని పైకి లేపాడు. యేసు పేతురుతో ఇలా అన్నాడు, “నీకు కొంచెం విశ్వాసం ఉంది! నేను నిన్ను భద్రంగా ఉంచగలనని ఎందుకు విశ్వసించ లేదు?”
అప్పుడు పెతురు, యేసు పడవలోనికి వచ్చారు. వెంటనే గాలి వీయడం నిలిచిపోయింది. నీరు సద్దుమణిగింది. ఆయనను చూచి శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆయనకు మ్రొక్కారు. ఆయనను ఆరాధించి ఆయనతో ఇలా అన్నారు, “నిజముగా నీవు దేవుని కుమారుడవు.”