unfoldingWord 25 - సాతాను యేసును శోధించడం
रुपरेखा: Matthew 4:1-11; Mark 1:12-13; Luke 4:1-13
भाषा परिवार: 1225
भाषा: Telugu
दर्शक: General
लक्ष्य: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
स्थिति: Approved
ये लेख अन्य भाषाओं में अनुवाद तथा रिकौर्डिंग करने के लिए बुनियादी दिशानिर्देश हैं। प्रत्येक भिन्न संस्कृति तथा भाषा के लिए प्रासंगिक बनाने के लिए आवश्यकतानुसार इन्हें अनुकूल बना लेना चाहिए। कुछ प्रयुक्त शब्दों तथा विचारों को या तो और स्पष्टिकरण की आवश्यकता होगी या उनके स्थान पर कुछ संशोधित शब्द प्रयोग करें या फिर उन्हें पूर्णतः हटा दें।
भाषा का पाठ
ప్రభువైన యేసు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యం లోనికి తీసుకొని వెళ్ళాడు, యేసు అక్కడ నలుబది రోజులు ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఉపవాసం ఉన్నాడు, సాతాను యేసు వద్దకు వచ్చి ఆయనను పాపం లోనికి పడేలా శోధించాడు.
మొదట సాతాను యేసుతో ఇలా చెప్పాడు, “నీవు నిజముగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను.”
అయితే యేసు సాతానుతో ఇలా సమాధానం ఇచ్చాడు, “దేవుని వాక్యంలో ఇలా రాసి ఉంది. ‘మనుష్యులు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని వాక్యము వలన జీవించును.”
అప్పుడు సాతాను యేసును ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకొని వెళ్లి ఆయనతో “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దుముకుము, ‘దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించగా వారు నీ పాదములకు రాయి తగులకుండ నిన్ను ఎత్తి పట్టుకొంటారు” అని చెప్పాడు.
సాతాను అడిగిన దానిని చెయ్యడం యేసుకు ఇష్టం లేదు. దానికి బదులుగా ఆయన ఇలా చెప్పాడు, “నీ ప్రభువైన దేవుణ్ణి నీవు శోధించకూడదు.”
తరువాత సాతాను ప్రభువైన యేసుకు ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించాడు. ఆవి ఎంత శక్తివంతమైనవో ఎంత సంపదలతో కూడుకొన్నవో చూపించాడు. ప్రభువుతో ఇలా చెప్పాడు, “నీవు నాకు మొక్కి నన్ను ఆరాధిస్తే నేను వాటిని నీకు దయచేస్తాను.”
ప్రభువైన యేసు ఇలా సమాధాన మిచ్చాడు, “సాతానా నన్ను విడిచి పొమ్ము! ‘నీ ప్రభువైన దేవుని మాత్రమే నీవు పూజించాలి’ అని రాయబడియున్నది.”
సాతాను శోధనలలో యేసు పడిపోలేదు. కనుక సాతాను ఆయనను విడిచిపెట్టాడు. అప్పుడు దేవుని దూతలు ఆయనకు పరిచర్య చేసారు.